దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతున్నది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు ఒడ్డున ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఇక కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి, జైశంకర్, కిషన్ రెడ్డి, అమిత్ షా, జేపీ నడ్డా, ప్రహ్లాద్ జోషి, పీయుష్ గోయల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, యూపీ సీఎం యోగి కూడా పాల్గొన్నారు.