ఇండియా న్యూఢిల్లీలోని రాజ్పథ్లో మొదటిసారి యోగా డే సెలబ్రేట్ చేయగా, 2వసారి చండీగఢ్లో జరిపారు. ఇలా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజున స్వయంగా యోగా గురువులు, ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా వేడుకల్లో పాల్గొని రకరకాల యోగాసనాలు వేసి ఆసనాల విశిష్ఠతని తెలియజేస్తున్నారు. యోగా అనేది మన జీవితంలో భాగమైతే కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. పురాతన కాలం నుంచి యోగాని ఆచరించేవారు.