గులకరాయిని మింగి ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని కడవేర్గు గ్రామానికి చెందిన షబీర్పాషా, జరీనాబేగం దంపతుల కుమార్తె అలీషా ఇంటి ఆరు బయట ఆడుకుంటుండగా గులకరాయి మింగింది. ఆ రాయి కాస్త గొంతులో అడ్డంగా ఇరుక్కుపోవడంతో చిన్నారి నానా అవస్థలు పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది.