తెలుగు రాష్ట్రాల్లో కార్న్ ఫ్లోర్ వాడకం పెరిగింది. సూప్ చిక్కగా చేయడానికి, కూరల్లో గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చేందుకు వాడే మొక్కజొన్న పిండిని తరచుగా వాడడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారు కార్న్ ఫ్లోర్ తినకూడదు. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఓ అధ్యయనం ప్రకారం, శుద్ధి చేసిన పిండి పదార్థాలు వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.