వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాబిన్ ఉతప్ప 50 పరుగులతో(32 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. గుర్క్రీత్(33), నమన్ ఓజా(25) రాణించగా.. కెప్టెన్ యువరాజ్(2 రన్స్) నిరాశపర్చారు.