టీ20 ప్రపంచకప్లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సూపర్-8కి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్ (27) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్ప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.