VIDEO: బ్రేక్స్ ఫెయిల్.. బస్సు నుంచి దూకేశారు

75చూసినవారు
అమర్‌నాథ్ యాత్రికులకు మంగళవారం పెను ప్రమాదం తప్పింది. కొందరు యాత్రికులు పంజాబ్‌లోని హోషియాపూర్ నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బస్సుకు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో బస్సు నుంచి కిందికి దూకేశారు. ఆర్మీ జవాన్లు సకాలంలో స్పందించి, బస్సుకు అడ్డంగా వాహనాలు పెట్టడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్