కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా హైస్కూల్లో శ్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించలేదన్న విమర్శలు వినిపించాయి. ఆ స్కూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించినదని వెల్లడైంది. సాయిబాబా పాఠశాల చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తరగతి గది పైకప్పు కూలిందని కేసు నమోదు చేశారు.