తమిళనాడులోని మైలాదుత్తురై జిల్లా చిదంబరం-నాగపట్నం హైవేపై తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. శ్రీధర్, శశికళ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు భరత్తో కలిసి బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. చెన్నై నుంచి వేలంకన్నికి వెళ్తున్న కారు వారి బైక్ను ఢీకొట్టింది. దీంతో బాలుడితో సహా దంపతులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో శ్రీధర్, శశికళ చనిపోయారు. వారి కొడుకు భరత్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.