తమిళనాడులోని విరుదునగర్ జిల్లా బంధువార్పట్టి గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను నలుగురు సిబ్బంది మిక్సింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఊహించని విధంగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. పేలుడు సంభవించిన సమయంలో బాణాసంచా ఫ్యాక్టరీలో 50 మందికి పైగా పని చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.