VIDEO: ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్‌ పేలి 25 మంది మృతి

77చూసినవారు
హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్‌ పేలి 25 మందికిపైగా మృతి చెందారు. 50మందికి పైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ టైరు పంక్చర్ అవ్వడంతో ఆయిల్‌ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు. ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్‌ పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్