VIDEO: ఛత్తీస్‌గఢ్‌లో మూడు IED బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

77చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సలైట్ల ప్రణాళికలను భద్రతా బలగాలు మరోసారి భగ్నం చేశాయి. భద్రతా బలగాలకు హాని కలిగించే ఉద్దేశంతో నక్సలైట్లు ఇప్పటికే మూడు వేర్వేరు చోట్ల ఐఈడీ బాంబులను అమర్చారు. ఈ IED బాంబులను భద్రతా దళాలు తెలివిగా.. సురక్షితమైన పద్ధతిలో స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేశాయి. ఈ చర్యను 50మంది జిల్లా పోలీసు బలగాలు, 217 కార్ప్స్ ఆఫ్ CRPF మరియు 208 కోబ్రా కార్ప్స్ సంయుక్తంగా నిర్వహించాయి.

సంబంధిత పోస్ట్