హైదరాబద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన దేవగిరి ఎక్స్ప్రెస్(17058) ట్రైన్ ను ప్రయాణికులు ఆపేశారు. ట్రైన్ లో, ఏసీ కంపార్ట్మెంట్స్లో ఏసీ పనిచేయట్లేదని మిరజాపల్లి దగ్గర ప్రయాణికులు ట్రైన్ను ఆపి ఆందోళన చేస్తున్నారు. దీనిపై స్టేషన్ మాస్టర్ కు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని తెలుపుతున్నారు. కాగా, కొద్దీ సేపటిక్రితమే స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరింది.