ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. శింగనమల శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి రాజీనామా చేశారు. శింగనమల అసెంబ్లీ వైసీపీ టికెట్ను ఆశించిన యామినికి నిరాశ ఎదురైంది. మనస్తాపానికి గురైన ఆమె వైసీపీకి రాజీనామా చేశారు. కాగా, శింగనమల టికెట్ను సాంబశివరెడ్డికి అనుకూలమైన వ్యక్తి వీరాంజనేయులుకు వైసీపీ అధిష్ఠానం ఇచ్చింది.