IPL-2024లో రాజస్థాన్ రాయల్స్ నేడు తన హోంగ్రౌండ్ లో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా ఆర్ఆర్ జట్టు పూర్తిగా పింక్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. కొత్త జెర్సీని కెప్టెన్ సంజూ శాంసన్ సోషల్ మీడియాలో పెట్టారు. #PinkPromise మిషన్ లో భాగంగా వీటిని ధరిస్తున్నారు. మహిళల సాధికారత ఈ మిషన్ లక్ష్యం. ఈ మ్యాచ్ కు విక్రయించే ప్రతి టికెట్ నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు.