UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రస్తుతం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే నగదు జమ చేసే వీలుంది. యూపీఐకి ఉన్న ఆదరణ దృష్ట్యా ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్టు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.