యూపీలోని ఘజియాబాద్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రియాంక శర్మ అనే వివాహిత మహిళ తన ప్రియుడి కోసం తనపై యాసిడ్ పోసుకుని హైడ్రామా సృష్టించింది. ప్రియుడి కోసం తన భర్తను మరియు కుటుంబసభ్యులను అరెస్ట్ చేయించి జైలుకి పంపాలని కుట్ర పన్నింది.అనంతరం తనపై యాసిడ్ దాడికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ప్రియాంక శర్మతో పాటు తన ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.