యూపీలోని లక్నోలో సోమవారం విషాద ఘటన జరిగింది. నగరంలోని వికాస్నగర్ ప్రాంతానికి చెందిన మనీషా (19) అనే యువతికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే ఇష్టం. ఇదే కోవలో ఆమె తన అక్కాచెల్లెళ్లు, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. ఇందిరా కెనాల్ వద్ద తనకిష్టమైన రీల్స్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో అదుపుతప్పి కాలువలో కొట్టుకుపోయింది. ఆమె కోసం పోలీసుల
ు కాలువలో గాలిస్తున్నారు. ఆమె చివరి వీడియో వైరల్ అవుతోంది.