ఏపీ ఎన్నికల బ‌రిలో ఎంత‌మంది ఉన్నారంటే..?

74చూసినవారు
ఏపీ ఎన్నికల బ‌రిలో ఎంత‌మంది ఉన్నారంటే..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. 25 లోక్‌సభ స్థానాలకు 503 మంది బరిలో ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,705 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా నంద్యాల పార్లమెంట్ స్థానానికి 36 మంది, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 మంది నామినేషన్లు ఫైనల్ అయ్యాయి. ఇక తిరుపతి అసెంబ్లీ స్థానంలో 48, చోడవరం నుంచి అత్యల్పంగా 6 మంది పోటీ పడనున్నారు.

సంబంధిత పోస్ట్