వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో ఆదివారం మండల బిజెపి అధ్యక్షులు అనంతయ్య ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించి చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నర్సింలు, బాలరాజ్, వెంకటయ్య, పాండు , మల్లేష్ బుచ్చయ్య , తదితరులు పాల్గొన్నారు.