వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పై మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ తీరు దేయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలుగా ఫిరాయింపులను బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించిందని అన్నారు.