ఘనంగా మొహరం వేడుకలు

76చూసినవారు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో బుధవారం మొహరం పండుగ సందర్భంగా పీర్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తులు పీర్లకు ఉదు బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలంతా
ఐకమత్యంగా ఆటపాటలతో పీర్ల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్