విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ

72చూసినవారు
విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ
డిప్యూటీ ఎన్ఎస్ఏ విక్రమ్ మిస్రీని విదేశాంగ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న వినయ్ క్వాట్రా పదవీకాలం జూలై 14తో ముగియనుంది. జూలై 15న విక్రమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 1989 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆయన గతంలో చైనా రాయబారిగా పనిచేశారు. గల్వాన్ ఘర్షణ జరిగినప్పుడు చైనాతో కమ్యూనికేషన్ కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్