BREAKING: సభలో ఎంపీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు (వీడియో)

71చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఫూలోదేవి నేతమ్‌ సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్‌ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్‌ పోడియం దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫూలోదేవి కళ్లు తిరిగి కింద పడిపోగానే అక్కడ ఉన్న సభ్యులు, రాజ్యసభ సిబ్బంది హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్