గోదావరిలోకి దూకిన మహిళ.. కాపాడిన జాలర్లు(వీడియో)

77చూసినవారు
AP: కుటుంబ కలహాల నేపథ్యంలో రాజమండ్రి రైల్ బ్రిడ్జి నుంచి గోదావరిలోకి దూడల నాగలక్ష్మి(40) అనే మహిళ దూకింది. స‌మాచారం అందుకున్న పోలీసులు జాల‌ర్ల స‌హాయంతో ఆమె కాపాడారు. అనంత‌రం ఆమెను స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. సినిమా స్టైల్లో పడవపై వేగంగా వచ్చిన జాల‌ర్లు.. మ‌హిళ‌ను కాపాడంతో స్థానికులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్