పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం బీహార్లోని నవ్గాచియా గ్రామంలో చోటుచేసుకుంది. శోభాదేవి అనే మహిళ ఫిబ్రవరి 16న పాలు అమ్మేందుకు వెళ్లి అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు.