లోక్సభ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా బుధవారం జల్పాయిగురిలోని టీ ఎస్టేట్లను ఆమె సందర్శించారు. రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో టీ తయారు చేశారు. అక్కడి కార్మికులకు టీ అందించారు. అలాగే టీ ఎస్టేట్ కార్మికులతో కలిసి తేయాకు కోశారు. మహిళా కార్మికులతో ఆమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.