విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు: తేజస్వీ యాదవ్

56చూసినవారు
విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు: తేజస్వీ యాదవ్
క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో తన సారథ్యంలోనే ఆడాడని తేజస్వీ యాదవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుత భారత జట్టులో కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లు తన బెంచ్‌మేట్సేనని చెప్పుకొచ్చారు. క్రికెటర్‌గా తనను ఎవరూ గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయినా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.

సంబంధిత పోస్ట్