నామినేటెడ్ పోస్టులు ఖరారు!

62చూసినవారు
నామినేటెడ్ పోస్టులు ఖరారు!
ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్దమైంది. తుది కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీలకు రాష్ట్ర స్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరాకు ముందే పదవులను ప్రకటించేలా CM చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, మిగిలిన పది శాతం పదవులు బీజేపీకి దక్కుతాయని నేతలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్