కరెంట్ అఫైర్స్: 'పోర్ట్ బ్లెయిర్' ఇకపై 'శ్రీ విజయపురం'

64చూసినవారు
కరెంట్ అఫైర్స్: 'పోర్ట్ బ్లెయిర్' ఇకపై 'శ్రీ విజయపురం'
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం 'పోర్ట్ బ్లెయిర్'ను 'శ్రీ విజయపురం' అని పేరు మార్చారు. ఈ మేరకు సెప్టెంబ‌ర్ 13వ తేదీ కేంద్రం ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతంగా ఇది ప్రస్తుతం కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంది. 836 దీవులు, అంతకన్నా చిన్న భూభాగాలతో అండమాన్ నికోబార్ ప్రాంతం విస్తరించింది. 550 దీవులు అండమాన్ వైపు, 22 ప్రధాన దీవులు నికోబార్ వైపు ఉంటాయి. వీటిని 150 కి.మీ.ల వెడల్పయిన '10 డిగ్రీల ఛానల్' జలభాగం విడదీస్తుంది.

సంబంధిత పోస్ట్