పెరిగిన ప్రాణహిత వరద ప్రవాహం

62చూసినవారు
పెరిగిన ప్రాణహిత వరద ప్రవాహం
కాళేశ్వరం వద్ద మళ్లీ ఉభయ నదుల ప్రవాహం పెరిగింది. ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలిసి వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. 7.8 మీటర్ల మేర నీటిమట్టం నమోదైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నదికి వరద ఉధృతి పెరిగిందని అధికారులు అన్నారు.

సంబంధిత పోస్ట్