డోర్నకల్ మండలం ముల్కలపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. వరంగల్, ములుగు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ. 8 లక్షలు నగదును తీసుకెళ్తుండగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ ఉపేందర్ రావు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఎస్టీ వీరన్న, హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, కానిస్టేబుల్ అనిల్ కుమార్, విద్యా సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.