మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

19021చూసినవారు
ఛత్తీస్‌గఢ్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన షబ్బీర్ (35) మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇనుగుర్తికి చెందిన షబ్బీర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఛత్తీస్ గఢ్ నుంచి ఖమ్మం జిల్లాకు లారీలో గ్రానైట్ బండ రాయిని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి ఓ గుట్టను ఢీకొనడంతో షబ్బీర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్