మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తౌర్య తండా పంచాయతీలో మంచి నీళ్ల ట్యాంకీ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను, వాటర్ లీకేజ్ ఉన్న పైపులను సర్పంచ్ తో కలిసి తండా వాసులు శ్రమదానం చేసి తొలిగించారు. ఈ విధంగా సర్పంచ్ భూక్యా శ్రీనివాస్ నాయక్... మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు ఇంటి శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం చెత్త తొలిగించడానికి సహకరించిన తండా వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ చూపుతున్న శ్రద్ధపై తండావాసులు హర్షం వ్వక్తం చేస్తున్నారు.