నెల్లికుదురు: బొలేరో వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

50చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు స్టేజి సమీపంలో మంగళవారం ఉదయం బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బొలెరో వాహనం ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబుబాబాద్ జిల్లా ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్