చీరకు మంటలు అంటుకుని మహిళకు గాయాలు

74చూసినవారు
చీరకు మంటలు అంటుకుని మహిళకు గాయాలు
చీరకు నిప్పు అంటుకొని మహిళకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. ప్రగల్లపల్లి గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ గ్యాస్ పై వంట చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకున్నాయి. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకి తరలించారు.

సంబంధిత పోస్ట్