పూసూరులో గుడుంబా పట్టివేత

62చూసినవారు
పూసూరులో గుడుంబా పట్టివేత
ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరులో బుధవారం గుడుంబా విక్రయాల సమాచారంతో వాజేడు ఎస్సై హరీష్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దన్నూరు దయాకర్, నల్లబోయిన భాస్కర్ అనే ఇరువురు వ్యక్తుల ఇండ్లలో సుమారు 18 లీటర్ల నిషేధిత గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ సారాను ఛత్తీస్ ఘడ్ నుండి వ్యాపారులు తీసుకొచ్చి అమ్ముతున్నారని, పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్