లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

1542చూసినవారు
ములుగు జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగి పొర్లుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర శనివారం ఒక ప్రకటనలో కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని ఆయన కోరారు. మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లవద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్