గంగారం మండలంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

52చూసినవారు
గంగారం మండలంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
ములుగు నియోజకవర్గంలోని గంగారం మండలం జంగాలపల్లి గ్రామ శివారులోని వాగు వెంబడి గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై రవి కుమార్ తన సిబ్బందితో కలిసి దాడులు చేసి 40 లీటర్లు చక్కెర పానకం ధ్వంసం చేశారు. అదేవిధంగా 20 కిలోల చక్కెరను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా రహిత జిల్లా, గంగారం మండలం లక్ష్యంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్సై కోరారు.

సంబంధిత పోస్ట్