డిఎంహెచ్ఓపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతి

70చూసినవారు
డిఎంహెచ్ఓపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతి
వరంగల్ జిల్లా వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని నర్సంపేటకు చెందిన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వరంగల్ జిల్లా కలెక్టరు కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టరన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్