వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని కాకతీయ నగర్లో నూనె మల్లయ్య వ్యవసాయ బావి వద్ద శనివారం వింత ఆకారం కలిగిన పక్షి కనిపించింది. ఈ వింత పక్షిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి పక్షిని తాము ఎప్పుడూ చూడలేదని అన్నారు. దీని గురించి నిట్ ప్రొఫెసర్ ను అడగగా దీనిని బార్న్ గుడ్లగూబ అని పిలుస్తారని, ఇది ధ్రువ, ఎడారి ప్రాంతాలు మినహా దాదాపు ప్రతిచోటా కనిపిస్తుందన్నారు.