ఎంజీఎం ఆసుపత్రిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు: కొండా సురేఖ

63చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో గురువారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. గతంలో వైయస్సార్ హయాంలో వైద్యం, విద్య, సంక్షేమం, అభివృద్ధి అన్నీ చూసుకునేవారని, అదేవిధంగా రేవంత్ ప్రభుత్వం కూడా వాటిపై దృష్టి సారించారని తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్