నిందితుడిని కఠినంగా శిక్షించాలి..!

491చూసినవారు
నిందితుడిని కఠినంగా శిక్షించాలి..!
అభం శుభం తెలియని పసి పిల్లలపై అత్యాచారాలు హత్యలు చేస్తున్న నిందితులను నడిరోడ్డులో ఎన్కౌంటర్ చేయాలని ఏ ఐ ఎఫ్ డి ఎస్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు. స్థానిక ఓంకార్ భవనం లో ఏ ఐ ఎఫ్ డి ఎస్ (అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య) ఆధ్వర్యంలో మౌనం పాటించిన అనంతరం మార్త నాగరాజు మాట్లాడుతూ.. హైదరాబాద్ రాజధానిలో సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చైత్ర అనే పసిపాపను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడం బాధాకరంగా ఉందని అన్నారు. ఆడుతూ పాడుతూ తిరుగుతూ అల్లారుముద్దుగా ఉండే ఆ గిరిజన బాలిక నరరూప రాక్షసుల చేతిలో బలి కావడం చట్టాలు కేవలం చుట్టాలుగా ఉండడం ద్వారా నరరూప రాక్షసులు సమాజంలో ఆడపిల్లల లపై దాడులు చేస్తున్నారు. ఈ మృగాలను నడిరోడ్డులో ప్రజల మధ్య ఎన్కౌంటర్లు లేదా రాళ్లతో కొట్టి చంపాలని అన్నారు. అలా చేస్తేనే తప్పు చేయడానికి భయపడతారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్