పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నడికుడ, ఆత్మకూరు, పరకాల మండలానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు.