హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్లను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. మండల కేంద్రంలోని రిజర్వాయర్ దక్షిణ కాలు వద్ద అనుమతి లేకుండా దేవునూరు గ్రామానికి చెందిన ఎండి. షాముద్దిన్, యోగేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రెండు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. దీంతో టిప్పర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వెల్లడించారు.