రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

62చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. మండల కేంద్రానికి చెందిన నీల శ్రీనివాస్ అనే వ్యక్తి పల్లగుట్ట క్రాస్ రోడ్ లో గురువారం ద్విచక్ర వాహనంపై యూటర్న్ తీసుకుండగా అటుగా వస్తున్న వ్యాన్ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి తీవ్రంగా గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్