హనుమకొండ కాజీపేట విష్ణుపురిలోని శ్వేతార్క ఆలయంలో ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక అర్చకులు ఐనవోలు రాధాకృష్ణశర్మ సాయికృష్ణశర్మలు తెలిపారు. మండపాల నిర్వాహకుల సెప్టెంబరు 7 నుంచే వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవాలన్నారు. ఉత్స వాల్లో భాగంగా గణపతికి నిత్యాభిషేకం, అర్చన, సాయంత్రం దర్బార్ సేవ ఒగ్గు కళారూపాలు, శాస్త్రీయ నృత్యాలు, ఉంటాయన్నారు.