ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని నియమ నిబంధనలను గురించి మాస్టర్ ట్రైనర్లు క్షుణ్ణంగా తెలియజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ ట్రైనర్లకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.