వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండలం మడికొండ గ్రామం ఆదివారం రోజు మడికొండ గ్రామానికి చెందిన 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల నరోత్తం రాధిక రెడ్డి దంపతులు, మనువడు సిద్దు మెట్టు రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘు చందర్, పూజారులు అభిలాష్ శర్మ, విష్ణుశర్మ, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.