ఢిల్లీలో నీటి కొరత.. కార్లు కడిగితే రూ.2,000 జరిమానా

75చూసినవారు
ఢిల్లీలో నీటి కొరత.. కార్లు కడిగితే రూ.2,000 జరిమానా
తీవ్ర ఎండల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పడిన నీటి కొరత నేపథ్యంలో ఆ రాష్ట్ర (ఆప్‌) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు చేపట్టాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశించింది. ఈ మేరకు కార్లు కడుగడం వంటివి చేస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. కార్లు, ఇతర వాహనాలను కడుగడం, నిర్మాణ, వాణిజ్య ప్రయోజనాల కోసం గృహ సరఫరా నీటిని వినియోగించడాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్